ఆమె పెద్దక్క మాత్రం పెళ్ళికి వోప్పించడానికి ప్రయత్నించినిది . ఇప్పుడు పెళ్లి పోతే ఇక సవతి తల్లి ఎప్పటికి పెళ్లి చేయదు అని చెప్పింది. ఇక దీనితో చేసేది ఏమి లేక గాయత్రి చంద్రమోహన్ తో పెళ్లి కి వోప్పుకుంది. పెళ్లి తిరుపతిలో జరగాలి అని నిర్ణయించుకున్నారు కాని, జోరున కురిసిన వాన వల్ల ప్రయాణం రద్దు చేసుకొని, ఊర్లోనే ఉన్నా రామాలయమ్లో పెళ్లి జరిపించారు .
చంద్రమోహన్ భార్యని అపురూపంగా చూసుకోవడం మొదలు పెట్టాడు. గాయత్రి పచ్చటి ఛాయా తో చూడ చక్కని రూపం తో మెరిసి పోతు ఉంటుంది. దీని తో కొత్తగా అత్తవారింటికి వచ్చిన గాయత్రి ని చూసి చాల మంది ఈర్ష్య పడ్డారు. పెళ్లి అయిన ౩ వ రోజు నుంచే ఆమె కి అత్త, ఆడ ఆడ పడుచు దగ్గర నుంచి ఆరళ్ళు మొదలు అయ్యాయి. చెప్పిన కట్నం ఇవ్వలేదు అని ఆమె ని సాధించటం మొదలు పెట్టారు. గాయత్రి చంద్రమోహన్ చాల బాధ పడ్డారు. ఈ విషయం గాయత్రి తండ్రి కి చెప్పుకుంది , కాని సవతి తల్లి మోజు లో పడిన ఆయన కూతురు ని పట్టించుకో లేదు. సవతి తల్లి విని కూడా విన్నట్టు నటించింది . ఇక చేసేది లేక తన చనిపోయిన తల్లి తరపున వచ్చిన ఒక ఎకరం పొలం తో తిరిగి వొచింది . ఇక అత్త గారింట్లో గాయత్రి కి కష్టాలు, దెప్పి పొడుపులు మొదలు అయ్యాయి. ఇదంతా చూసి చంద్రమోహన్ చాల బాధ పడ్డాడు. వెంటనే తన భార్య ని తీసుకొని హైదరాబాద్ కి రావాలని నిర్ణయం తీసుకున్నాడు . ఈ విషయం అత్త గారి ఇంట్లో తెలిసి గాయత్రి ని బాగా తిట్టారు , కొట్టారు . ఇంట్లో నుంచి పోతే పైసా ఆస్తి కూడా ఇవ్వను అని బెదిరించారు . కానీ ఇంకా అక్కడ ఉండ బుద్ధి కాక వెంటనే బయల్దేరి కట్టు బట్టల తో హైదరాబాద్ లో అడుగు పెట్టారు గాయత్రి చంద్రమోహన్. ఇలా కొత్తగా పెళ్లి అయిన ఒక జంట ఎన్నో ఆశ ల తో , ఎన్నో భయాల తో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు
నువ్వంటే ఇష్టం
7 years ago
3 comments:
Enti story writer vi ayyavente? very nice.. chala rojula tharuvatha oka telugu story chadivanu..
gud Swetha gud ..nice story u will become a good writer.Durga aunty did go thro ur story ..Iam really surprised how can u manage both job and writing ....
hey babe......thank you very much for realizing me, I am very Lucky..........and succeeded in choosing most beutiful and smart women and........Writer(lol....).
Post a Comment